భగవద్గీతలోని ‘త్రైతం’ సిద్ధాంతాన్ని తీసుకొని మనిషి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అలాగే ఆత్మ కూడా ఉందనే కాన్సెప్ట్తో హీరోయిన్ మౌర్యాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘త్రైతం’. శుభలేఖ సుధాకర్, రాజేశ్వరి నాయర్ నటీనటులుగా వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై రవికుమార్.ఎస్ను దర్శకుడిని పరిచయం చేస్తూ పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిఖిల్ క్లాప్ నివ్వగా చందు మొండేటి కెమెరా స్విచాన్ చేశారు.
అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ “లేడీ ఓరియెంటెడ్ కథతో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కే ఈ సినిమాను హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రెండు షెడ్యూల్లలో పూర్తి చేస్తాము. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది”అని అన్నారు. నిర్మాత పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ రవి నాకు ఈ లేడీ ఓరియెంటెడ్ కథ చెప్పగానే నచ్చి వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని చెప్పారు. హీరోయిన్ మౌర్యాని మాట్లాడుతూ ఇలాంటి మంచి సినిమాలో చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరాః జి అమర్, సంగీతంః ఘనశ్యామ్, ఎడిటర్ : కారుమంచి నాని బాబు.