Thursday, May 9, 2024

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

TS Inter board extended Exam Fee date 2021

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఈ నెల 22 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.100 ఆలస్య రుసుంతో ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 8 వరకు చెల్లించవచ్చని తెలిపారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో మార్చి 15 వరకు, రూ. 2 వేల అపరాధ రుసుంతో మార్చి 22 వరకు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఎలాంటి షరతులు లేకుండా పరీక్ష ఫీజులు తీసుకోవాలని తెలిపారు. ట్యూషన్ ఫీజు చెల్లింపుతో సంబంధం లేకుండా పరీక్ష ఫీజుకు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మే 1 నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే -2 నుంచి జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే ఏప్రిల్ 7 నుంచి -20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనుండగా, ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు.

TS Inter board extended Exam Fee date 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News