Monday, April 29, 2024

రహమత్ నగర్‌లో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు(శుక్రవారం) ఉదయం రహమత్ నగర్‌లో ఆర్టీసి బస్సు, ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బస్సు డ్రైవర్, కండక్టర సంఘటనాస్థలం నుంచి పారిపోయినట్లు ప్రయాణికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News