Monday, April 29, 2024

గణేష్ నిమజ్జనానికి 535 ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సెప్టెంబర్ 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఆధ్వర్యంలో 535 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నిమజ్జన శోభాయాత్ర అంతటా భక్తులకు ఇబ్బందులు కలగకుండా వివిధ మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గణేశ నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ఎండీ తెలిపారు. ప్రత్యేక బస్సు సర్వీసులకు సంబంధించిన సహాయం కోసం ప్రయాణికులు బస్ స్టేషన్‌ను 9959226154 నంబర్‌లో, కోఠి బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News