Monday, April 29, 2024

టిటిడి బోర్డు రాజకీయ పునరావాస కేంద్రం: పురందేశ్వరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిటిడి బోర్డును రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ వైసిపి ప్రభుత్వం నిరూపించిందని బిజెపి ఎపి అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. బోర్డు సభ్యులుగా శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్ నియామకమే నిదర్శనమన్నారు. ఢిల్లీ మద్యం స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డి పాత్రధారిగా ఉన్నారని, ఎంసిఐ స్కామ్‌లో దోషిగా తేలి కేతన్ దేశాయ్ పదవి కోల్పోయారని విమర్శించారు. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే విధానాన్ని బిజెపి ఖండిస్తోందని పురందేశ్వరి పేర్కొన్నారు.

Also Read: పోటీకి సీనియర్లు విముఖం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News