Monday, April 29, 2024

కరోనాతో తెలుగు జర్నలిస్ట్ మృతి

- Advertisement -
- Advertisement -

Tv5 crime reporter Manoj Died with corona in Hyderabad

హైదరాబాద్: తెంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయపెడుతోంది. ఆదివారం ఉదయం కరోనాతో ఓ తెలుగు జర్నలిస్ట్ మృతి చెందాడు. ప్రముఖ టి.వి ఛానల్ లో క్రైమ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న మనోజ్ కుమార్ కు కరోనా మహమ్మారి సోకింది. దీంతో నాలుగు రోజుల క్రితం అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ మనోజ్ మృతి చెందినట్టు వెద్యులు తెలిపారు. అతనికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. అతని మృతిపట్ల తోటి జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో 3,496మందికి కోవిడ్-19 సోకింది. ఈ వైరస్ తో ఇప్పటివరకు 1,710 మంది నయమై కోలుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 123 మందిని కరోనా కబలించగా… ప్రస్తుతం 1,663 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం ప్రజలను భయందోళనకు గురిచేస్తోంది.

Tv5 crime reporter Manoj Died with corona in Hyderabad

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News