- Advertisement -
మనతెలంగాణ/మాదన్నపేట్ః కరోనా వ్యాధి భారీన పడి గాంధీ హాస్పటల్లో చికిత్స పొందూ ఇద్దరూ మాదన్నపేట్ వాసులు మృతి చెందారు. వివరాల ప్రకారం మాదన్నపేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ సర్కిల్- 7లోని కుర్మగూడ డివిజన్కు చెందిన 79 ఏళ్ల వృద్ధుడు,మరో కుటుంబానికి చెందిన 55 ఏళ్ల మహిళా మృతి చెందిన్నట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం కరోనా లక్షణాలు కనబడటంతో వారికి జిహెచ్ఎమ్సి అధికారులు గాంధీ హాస్పటల్కు తరలించారు. మంగళవారం వీరు ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందిన్నట్లు అధికారులు వెల్లడించారు.
Two Madannapet Men died due to Corona
- Advertisement -