- Advertisement -
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పంజాబ్లో ఇద్దరు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) గురువారం తెల్లవారుజామున హతమార్చింది. దేశంలోకి చొరబడిన ఇద్దరు సాయుధ ఉగ్రవాదులను అట్టారీ వద్ద తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో బిఎస్ఎఫ్ జవాన్లు హతమార్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగమంచు అలుముకున్న కారణంగా గాలింపు చర్యలకు ఆలస్యమవుతోందని, గాలింపు చర్యలు ప్రారంభించిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని వర్గాలు తెలిపాయి.
Two militants killed on Punjab border
- Advertisement -