Friday, May 3, 2024

మిగిలిన వారికి రుణాలు ఇవ్వండి: వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

TRS Leader Vinod Kumar Meets EC

హైదరాబాద్: ముద్ర పథకం కింద తక్షణమే వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని మాజీ ఎంపి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ రాశారు. ముద్ర రుణాల మంజూరులో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విరుచుకపడ్డారు. జనాభా ప్రాతిపదికన 68 లక్షల మందికి రుణాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 40.9 లక్షల మందికే ఇచ్చారని తెలియజేశారు. మిగిలిన 28 లక్షల మందికి తక్షణమే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News