Saturday, April 27, 2024

కోహ్లీ సెంచరీ.. సచిన్ రికార్డును సమం చేసిన స్టార్ బ్యాట్స్ మన్

- Advertisement -
- Advertisement -

భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ సాధించి,  వన్డేల్లో 49 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. ఇటీవల సెంచరీలపై సెంచరీలు చేస్తూ ఫామ్ లో ఉన్న కోహ్లీ, ప్రపంచ కప్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోనే సెంచరీ చేయాల్సిఉండగా, 88 పరుగుల వద్ద అవుటయ్యాడు.

ప్రస్తుత ప్రపంచ కప్ కు ముందు కోహ్లీ 47 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాపై 85 పరుగులు చేసి అవుటైనా, బంగ్లాదేశ్ తో జరిగిన పోటీలో సెంచరీ చేసి, సచిన్ రికార్డుకు చేరువగా వచ్చాడు. తాజా మ్యాచ్ లో సెంచరీ సాధించి, సచిన్ రికార్డును సమం చేశాడు.

Virat Kohli equalled Sachin Tendulkar as he hit his 49th ODI century

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News