Thursday, May 9, 2024

అభివృద్ధి చేసే వారిని గెలిపించుకోవాలి: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

Vote cast for vanidevi in MLC Elections

హైదరాబాద్: అభివృద్ధిని చేసే వారిని గెలిపించుకునే బాధ్యత పట్టభద్రులదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తాండూరులో పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. బిజెపి నేతలు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని టిఆర్‌ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాణీదేవి పేరు ప్రకటించగానే ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టాయన్నారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి ఎస్. వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్‌సి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News