Thursday, May 9, 2024

వాణీదేవిని గెలిపించేందుకు కలిసి కట్టుగా పని చేయాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

TRS workers hard work for win of vanidevi

హైదరాబాద్: ఎంఎల్‌సి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేలా టిఆర్‌ఎస్ శ్రేణులు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. తాండూరులో జరిగిన పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి వాణీదేవి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. మనం పట్టుబట్టి పని చేస్తేనే భారీ మెజార్టీతో గెలవటం ఖాయమన్నారు. ఓటేసే ముందు పెట్రో ధరలు గుర్తుంచుకు తెచ్చుకొని ఓట్లు వేయండన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న ఏ ఒక్క సంక్షేమ పథకం బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్‌సి మహేందర్ రెడ్డి, ఎంఎల్సీ అభ్యర్థి వాణీ దేవి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News