Friday, April 26, 2024

ఫైనల్ సమరం నిరాశ కలిగిస్తోంది: వివిఎస్ లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

VVS Laxman disappointed on ICC WTC Final

ముంబై: భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ పోరు తనకు ఏమాత్రం సంతృప్తి కలిగించడం లేదని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫైనల్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి అనుసరిస్తున్న తీరుపై అసంతృప్తి వెల్లగక్కాడు. వరల్డ్‌కప్‌కు సమానంగా భావించే డబ్లూటిసి ఫైనల్ పోరును నిర్వహిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదన్నాడు. అంతేగాక ఇంగ్లండ్‌లో జూన్‌లో ప్రతికూల వాతావరణం ఉంటుందని తెలిసి కూడా అక్కడ ఫైనల్‌ను నిర్వహించాలని భావించడం బాధాకరమన్నాడు. భారీ వర్షం వల్ల ఇప్పటికే రెండు రోజుల ఆట పూర్తిగా తుడిచి పెట్టుకు పోవడం తనతో పాటు కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురి చేసిందని లక్ష్మణ్ వాపోయాడు.

VVS Laxman disappointed on ICC WTC Final

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News