Monday, April 29, 2024

నటి రేష్మా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Actor reshma passes away

చెన్నై: శ్వాస సంబంధమైన సమస్యతో బాధపడుతూ నటి రేష్మా(42) కన్నుమూసింది. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది కలగడంతో రేష్మాను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఒక సారి పాజిటివ్ మరోసారి నెగిటివ్ వచ్చింది. శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఐసియులో చేర్పించారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. బిసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరిపించారు. కార్తీక్ హీరోగా నటించిన కిళక్కు ముగం సినిమాలో ఆమె నటించారు. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో రేష్మా నటించి మెప్పించారు. కోలీవుడ్ సీనియర్ నటుడు రవిచంద్రన్ కుమారుడు హంసవర్ధన్‌ను పెళ్లి చేసుకున్నారు. అనంతరం తన పేరును శాంతిగా మార్చుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News