Saturday, April 27, 2024

గోదావరిలో తగ్గిన నీటి మట్టం

- Advertisement -
- Advertisement -

బాసర : బాసర గోదావరిలో రోజు రోజుకు నీటి మట్టం తగ్గిపోతుంది. బాసర గోదావరి నుంచి బాసర నిజామాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాలకు నీటి సరఫరా అవుతుంది. వీటితో పాటు బాసర అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు స్నానాలు చేయడం, ఆలయానికి, ఆర్జీయూకేటికి నీటి సరఫరా చేస్తారు.

నీటి మట్టం రోజు రోజుకు తగ్గిపోవడంతో బాసర నిజామాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు ముందు జాగ్రత్తలో భాగంగా తాత్కాళిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే వచ్చే రోజుల్లో నీటి కష్టాలు ఎదుర్కొవాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News