- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన సిఎం కెసిఆర్ చిత్రపటానికి సైబరాబాద్ హోంగార్డుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పాలాభిషేకం చేశారు. తెలంగాణ హోంగార్డ్స్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సీనియర్ ప్రెసిడెంట్ కోత్వాల్ దయానంద్, ప్రధాన కార్యదర్శి కుమార్స్వామి, సైబరాబాద్ అధ్యక్షుడు అశోక్కుమార్, నల్గొండ అధ్యక్షుడు యాదగిరి పాలాభిషేకం చేశారు. పిఆర్సి ప్రకటించిన సిఎం కేసిఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో అబ్రహం, వెంకటేష్, గోపాల్ పాల్గొన్నారు.
- Advertisement -