Saturday, April 27, 2024

హైదరాబాద్ రెండో రాజధానిపై ప్రధానికి ఎందుకు లేఖ రాయడం లేదు?

- Advertisement -
- Advertisement -
విద్యాసాగర్‌రావును ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : దేశానికి రెండో రాజధానిగా హైద్రాబాద్‌ను చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవా? బిజెపి పార్టీకి సంబంధించినవా? అని మాజీ ఎంపి, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేయాలని శుక్రవారం విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలని అంబేద్కర్ ఆనాడే చెప్పిన విషయాన్ని విద్యాసాగర్ రావు గుర్తు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యాసాగర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎందుకు లేఖ రాయడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విద్యాసాగర్‌రావు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నికల స్టంట్ గా కన్పిస్తున్నాయన్నారు. సుదీర్ఘకాలం పాటు బిజెపిలో పనిచేసిన విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రిగా కూడ పని చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహారాష్ట్రకు గవర్నర్‌గా విద్యాసాగర్ రావు పని చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా పదవీకాలం పూర్తైన తర్వాత తెలంగాణకు ఆయన తిరిగి వచ్చారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిని చేయాలని విద్యాసాగర్‌రావు గతంలో కూడా డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News