Wednesday, May 1, 2024

బైక్ ను ఢీకొట్టిన లారీ.. భార్య మృతి, భర్తకు గాయాలు..

- Advertisement -
- Advertisement -

Woman killed in road accident in Dundigal

హైదరాబాద్: నగరంలోని దుండిగల్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కైసర్ నగర్ లో బైక్ పై వెళ్తున్న దంపతులను ఓ కాంక్రికట్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్యా విజయరాణి(43) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భర్త థామస్ కు గాయాలయ్యాయి. దంపతులు ప్రగతి నగర్ నుంచి అల్వాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Woman killed in road accident in Dundigal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News