Wednesday, May 8, 2024

చేతబడి… మహిళలకు గుండు కొట్టించి… మలమూత్రాలు తినిపించి….

- Advertisement -
- Advertisement -

tonsured

పాట్నా: చేతబడి చేస్తున్నరనే నేపంతో ముగ్గురు మహిళలకు గుండు కొట్టించి.. అర్ధ నగ్నంగా ఊరేగించి.. మలం తినిపించి మూత్రం తాగించిన సంఘటన బిహార్‌లోని ముజఫర్ నగర్‌లో జరిగింది. ఈ దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డక్రమా గ్రామంలో ముగ్గురు మహిళలు మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కొన్ని కుటుంబాల సభ్యుల అనారోగ్యానికి గురవుతున్నారని వారిపై దాడి చేశారు. ముగ్గురు మహిళలకు గుండు కొట్టించి.. అర్ధ నగ్నంగా ఊరేగించి.. మలం తినిపించి మూత్రం తాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎఎస్‌పి అమితేష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు బాధితులు ఫిర్యాదు చేయలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News