Thursday, May 9, 2024

టోక్యో ఒలింపిక్స్: ఇండియాకు మరో గోల్డ్ మెడల్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ సాధించింది. హంగరీలోని బుడాపెస్ట్ లో ఆదివారం జరిగిన 73 కేజీల విభాగం ఫైనల్లో బెలారస్ ప్రత్యర్థి కెనియా పటపోవిచ్‌పై 5-0 తేడాతో ఆమె గెలిచింది. ఈ మధ్య కాలంలో ప్రియా మాలిక్ టాప్ ఫామ్‌లోఉంది. 2019లో జరిగిన ఖేలో ఇండియాలో ఆమె గోల్డ్ సాధించింది. అదే ఏడాది ఢిల్లీలో జరిగిన 17వ స్కూల్ గేమ్స్‌లోనూ ప్రియా గోల్డ్ మెడల్ విజేతగా నిలిచింది. గతేడాది కూడా ఆమె రెండు బంగారు పతకాలు సాధించింది. ఇక గురువారం జరిగిన ఇదే వరల్డ్‌క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 65 కేజీల విభాగంలో మరో ఇండియన్ రెజ్లర్ వర్ష కూడా బ్రాంజ్ మెడల్ సాధించింది.

Wrestler Priya Malik won gold medal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News