- Advertisement -
హైదరాబాద్: రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాకత్ పూర-ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని యువకుడు పట్టాలు దాడుతుండగా రైలు ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఆ యువకుడు దుర్మరణం చెందాడు. రైలు వేగంగా ఢీకొట్టడంతో శరీర భాగాలు విడిపోయాయి. స్థానికుల సమాచారం రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో యువకుడి మృతదేహం గుర్తించడం సాధ్యంకాలేదని పోలీసులు వెల్లడించారు. మృతుడి ఒంటిపై నలుపు రంగు చొక్క, నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Young Man dead in MMTS Train Accident in Hyderabad
- Advertisement -