Saturday, April 27, 2024

లవర్ ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

- Advertisement -
- Advertisement -

Young man murder over Love issue

నిజామాబాద్: ప్రేమ వ్యవహారం ప్రియుడి హత్యకు దారి తీసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూరులో జరిగింది. ఈ హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని ఎసిపి రఘు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిద్ధార్థ (17), కనక రాజేష్ బంధువైన యువతి గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆ ప్రేమ జంట రోజు చాటింగ్ చేసుకునేవారు. ప్రేమ విషయం రాజేష్‌కు తెలియడంతో తన స్నేహితులు ధోన్‌పాల్, జుంబరాత్ అన్వేష్‌తో కలిసి సిద్ధార్థను బెదిరించారు. వీళ్ల బెదిరింపులకు సిద్ధార్థ్ బయపడకపోవడంతో దాడి చేయాలని రాజేష్ నిర్ణయం తీసుకున్నాడు. హాసా కొత్తూరులో సిద్ధార్థపై దాడి చేయడానికి రాకేష్ ప్రయత్నించినప్పటికి కుదరలేదు. బుధవారం రాత్రి సిద్ధార్థ స్నేహితుడు బాలాగౌడ్‌తో పోన్ చేయించి గ్రామ శివారులోకి రప్పించారు. సిద్దార్థ రాగానే కర్రలతో అతడిపై రాజేష్, అతడి స్నేహితులు దాడి చేశారు.

సిద్ధార్థ స్పృహ తప్పి పడిపోవడంతో బాలాగౌడ్ ఇంటి వద్ద పడుకోబెట్టారు. బలమైన గాయాలు ఉండడంతో ఊపిరాడక సిద్ధార్థ కన్నుమూశాడు. అతడు చనిపోయాడని తెలుసుకొని బాలాగౌడ్, రాజేష్ కలిసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఉప సర్పంచ్ రాజేశ్వర్‌కు ఫోన్ చేసి సిద్ధార్థ కరోనాతో మృతి చెందాడని అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని రాజేష్ కోరారు. పిఎంపి వైద్యుడు మథీన్‌తో కూడా కరోనాతో అతడు మృతి చెందాడని రాజేష్ చెప్పించాడు. సిద్దార్థ కుటుంబ సభ్యులు కూడా నమ్మడంతో ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఒంటిపై బలమైన గాయాలతో చనిపోయాడని శవ పరీక్షలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్‌తో పాటు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పస్తుతం మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎసిపి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News