- Advertisement -
హైదరాబాద్: నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ పి కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాధితుడిని తరుముతూ కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు.. మృతిచెందిన వ్యక్తి ఎవరు?, అతనిని ఎందుకు చంపారు?, పాత కక్ష్యలు లేక ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారి తీసిందా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Young man Murdered in Hyderabad amid Lockdown
- Advertisement -