Saturday, April 27, 2024

పరీక్ష రాయడానికి వెళ్లిన అమ్మాయి తిరిగిరాలేదు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్తూరు జిల్లా కేంద్రంలోని కన్నయ్యనాయుడు కాలనీలో నవ్య (21) అనే టెకీ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. చెన్నైలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆమె జాబ్ చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం చేస్తోంది. జులై 10న పరీక్ష రాయడానికి తిరుపతికి వెళ్లింది. ఆ రోజు ఇంటికి రాకపోవడంతో ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఎంత గాలించినా ఆమె ఆచూకీ లేకపోవడంతో తండ్రి రవికుమార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సిఐ యుగంధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నానని తెలిపాడు. ఆమె ఆచూకీ తెలిస్తే ఫోన్ నంబర్లకు 9491074517 ఫోన్ చేయాల్సిందిగా కోరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News