Thursday, May 9, 2024

ఎపిలో కొత్తగా 10,413 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

10413 new covid-19 cases reported in andhra pradesh

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 85,311 కరోనా పరీక్షలు చేయగా 10,413 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో 15,469 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. తాజాగా మరో 83 మందిని కరోనా కబలించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 11,296కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 17,38,990 మందికి కరోనా వైరస్ సోకగా, 15,93,921 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం 1,33,773 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి 2,075, చిత్తూరు 1,574 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ జిల్లాలను మినహాయిస్తే, మిగిలిన అన్ని జిల్లాల్లో 1000కి లోపే పాజిటవ్ కేసులు రికార్డు అయ్యాయి. విజయనగరం జిల్లాలోనే అత్యల్పంగా 293 కేసులను గుర్తించారు. చిత్తూరు జిల్లాలో అధికంగా 14 మంది చనిపోగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది మరణించారని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

10413 new covid-19 cases reported in andhra pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News