Sunday, April 28, 2024

ప్రధాని బహుమతుల ఇ-వేలం

- Advertisement -
- Advertisement -

1081 gifts that PM got have received bids till Oct 1 for e- auction

1081కి బిడ్స్ దాఖలు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి వచ్చిన బహుమతుల్ని ఇవేలంకు పెట్టగా అక్టోబర్ 1 వరకు 1081 వస్తువులకు బిడ్లు దాఖలయ్యాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది దాదాపు 1348 బహుమతుల్ని ఇవేలంకు పెడుతున్నట్టు ఆయన తెలిపారు. వాటిలో టోక్యో ఒలింపిక్స్ విజేతలు ప్రధానికి ఇచ్చిన గిఫ్ట్ కూడా ఉన్నదన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహిస్తున్న ప్రస్తుత ఇవేలం ఈ ఏడాది మూడోదని ఆయన తెలిపారు. ప్రధానికి వచ్చిన బహుమతుల్ని ఇవేలం కోసం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ప్రదర్శిస్తున్నారు. శనివారం కిషన్‌రెడ్డి నేషనల్ గ్యాలరీని సందర్శించారు. తనకు వచ్చిన బహుమతుల్ని వేలంకు పెట్టిన మొదటి ప్రధాని మోడీ అని కిషన్‌రెడ్డి తెలిపారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును గంగానది శుద్ధి కోసం చేపట్టిన నమామీ గంగా కార్యక్రమం కోసం ఇవ్వనున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News