11 మంది మృతి, పలువురికి గాయాలు
కాబుల్: దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు హింసాత్మక దాడులలో 11 మంది పౌరులు, భద్రతా సిబ్బంది మరణించారు. దక్షిణ ఉరుజ్గన్ ప్రావిన్సులో గురువారం తెల్లవారుజామున ఒక సైనిక స్థావరానికి సమీపంలో ఆత్మాహుతి దళానికి చెందిన వ్యక్తి ఒకడు కారుతో పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పేల్చివేసిన ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించారు. టిరిన్ కోట్లోని సైనిక స్థావరం వద్ద ఈ దాడి జరిగినట్లు ఉరుజ్గన్ ప్రాంతీయ మండలి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ కరీమ్ కరీమి ధ్రువీకరించారు. అయితే కచ్ఛితంగా ఎందరు మరణించింది ఆయన నిర్ధారించలేదు. దక్షిణ హెల్మాండ్ ప్రావిన్సులోని లష్కర్ గా పట్టణ శివార్లలో జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు పౌరులు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. మృతులలో పిల్లలు, మహిళలు ఉన్నట్లు ప్రాంతీయ మండలి అధ్యక్షుడు అటావుల్లా ఆఫ్ఘన్ తెలిపారు. ఈ దాడులకు బాధ్యలు ఎవరన్నది తెలియరాలేదు. కాగా..ఆఫ్ఘన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం అంతానికి ప్రభుత్వ అధికారులు ఖతార్లో తాలిబాన్లతో చర్చల పునరుద్ధరణకు ఉపక్రమిస్తున్న తరుణంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
11 killed in Violent attacks in southern Afghanistan