- Advertisement -
వడోదర: గుజరాత్లోని వడోదర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహువద్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు ట్రక్కులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వడోదరలోని ఎస్ఎస్జి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
12 Dead after Two Trucks Collide in Vadodara, Gujarat
- Advertisement -