Monday, April 29, 2024

ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -

12 omicron cases were reported in Telangana

రాష్ట్రంలో 55కు చేరిన బాధితుల సంఖ్య
విదేశాల
నుంచి వచ్చిన
10మందిలో కొత్త వేరియంట్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా సోమవారం ఒక్కరోజే 12 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కి పెరిగింది. తాజాగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో 10మందిలో ఈ కొత్త వేరియంట్ వెలుగుచూడగా, మరో ఇద్దరు కాంటాక్టు వ్యక్తుల్లో ఈ వైరస్‌ని గు ర్తించారు. ఒమిక్రాన్ బాధితుల్లో ఇప్పటివరకు 10మంది కోలుకు న్నారు. గడిచిన 24 గంటల్లో 37,837 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,80,844కి చేరిం ది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,023కి చేరింది. తాజాగా 181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,417 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 263 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా,24 మందికి ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. మరో 19 మంది ఫలితాలు రావాల్సి ఉంది. గత రెండు రోజులుగా రోజుకు 3 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఎట్ రిస్క్ దేశాల ఇప్పటి వరకు 11,756 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News