- Advertisement -
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా 24,942 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 1490 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయని.. మరో 56 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. తాజాగా లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,210 మంది కోలుకోగా, కరోనా బారినపడి మొత్తం 779 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 18,953 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. లాక్డౌన్ అమలుపై చర్చలు జరుపుతున్నాము. ఏప్రిల్ 30 తర్వాత నిర్ణయం ప్రకటిస్తాం అని తెలిపారు.
1490 New Corona Cases Registered in India
- Advertisement -