Saturday, April 27, 2024

రెండు లక్షల 45 వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1539 new covid 19 cases reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 45 వేలు దాటింది. మర్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,45,682 కేసులు తేలాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఈ మన దగ్గర వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా బుధవారం 44,327 టెస్టులు చేయగా 1539 పాజిటివ్‌లు తేలాయి.

వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 285 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 14, భద్రాద్రి 82,జగిత్యాల 45, జనగాం 22, భూపాలపల్లి 12, గద్వాల 13, కామారెడ్డి 36, కరీంనగర్ 86 ,ఖమ్మం 78, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 43,మహబూబాబాద్ 21, మంచిర్యాల 33, మెదక్ 23, మేడ్చల్ మల్కాజ్‌గిరి 102, ములుగు 32, నాగర్‌కర్నూల్ 33, నల్గొండ 69, నారాయణపేట్ 1, నిర్మల్ 20, నిజామాబాద్ 37, పెద్దపల్లి 39, సిరిసిల్లా 33, రంగారెడ్డి 123, సంగారెడ్డి 40, సిద్ధిపేట్ 38, సూర్యాపేట్ 52, వికారాబాద్ 12, వనపర్తి 13, వరంగల్ రూరల్ 29, వరంగల్ అర్బన్ లో 46, యాదాద్రిలో మరో 23 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,45,682కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,25,664కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

ప్రతి పది లక్షల్లో లక్షా 20 వేల మందికి టెస్టులు….

రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో లక్షా 20వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే డబ్లూహెచ్‌ఓ సూచించిన దాని కంటే 22 రెట్లు అదనంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.

రెండు లక్షల 25వేల మంది కోలుకున్నారు….

రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,45,682 మందికి పాజిటివ్ తేలగా, వీటిలో రెండు లక్షల 25 వేల మంది ఆరోగ్యవంతులుగా మారారు. అంటే దాదాపు 96 శాతం మంది పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమవుతోందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News