Monday, April 29, 2024

98 శాతానికి పెరిగిన రికవరీ రేటు

- Advertisement -
- Advertisement -

157 new covid cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 157 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 27 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 6, జగిత్యాల 3, జనగాం 0, భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 9,ఖమ్మం 8, ఆసిఫాబాద్ 1, మహబూబ్‌నగర్ 2, మహబూబాబాద్ 6, మంచిర్యాల 7, మెదక్ 2, మేడ్చల్ మల్కాజ్‌గిరి 11, ములుగు 2, నాగర్‌కర్నూల్ 1, నల్గొండ 6, నారాయణపేట్ 0, నిర్మల్ 4, నిజామాబాద్ 6, పెద్దపల్లి 4, సిరిసిల్లా 2, రంగారెడ్డి 10, సంగారెడ్డి 8, సిద్ధిపేట 4, సూర్యాపేట్ 3,వికారాబాద్ 2, వనపర్తి 0, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 9, యాదాద్రిలో మరో నలుగురికి పాజిటివ్ తేలింది. అంతేగాక వైరస్ దాడిలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,95,988కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,92,578కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

98 శాతానికి పెరిగిన రికవరీ….

రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 98 శాతానికి పెరిగింది. అంటే వైరస్ సోకిన ప్రతి వందలో 98 మంది సులువుగా కోలుకుంటున్నారని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అంతేగాక టెస్టింగ్, ట్రేసింగ్, ట్మీట్మెంట్ విధానాలను సమర్ధవంతంగా అమలు చేయడంతో రాష్ట్రంలో అతి తక్కువ మరణాలు రికార్డు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1613 కరోనాతో చనిపోగా, డెత్ రేట్ కేవలం 0.54 శాతంగా నమోదైంది. ఇంత తక్కువ స్థాయి మరణాలు మరేరాష్ట్రంలోనూ నమోదు కాలేదు. దీంతో ఇటీవల ఆర్ధిక సర్వే కూడా అభినందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News