Monday, April 29, 2024

2.95 లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

169 New Covid-19 Cases Reported in Telangana

కొత్తగా మరో 169 మందికి వైరస్, ఒకరు మృతి
జిహెచ్‌ఎంసి పరిధిలో 31, జిల్లాల్లో 138 పాజిటివ్‌లు
2,95,270 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,95,270కి చేరుకుంది. అయితే వీరిలో ఏకంగా 2,91,699 మంది ఆరోగ్యవంతులుగా మారగా, కేవలం 1964 మాత్రమే యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 780 మంది ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారంతా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కొత్తగా మరో 169 మందికి వైరస్ సోకగా, వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 31, ఆదిలాబాద్‌లో 5, భద్రాద్రి 7, జగిత్యాల 8, జనగాం 1, భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 4, కరీంనగర్ 10,ఖమ్మం 6, ఆసిఫాబాద్ 0, మహబూబ్‌నగర్ 5, మహబూబాబాద్ 3, మంచిర్యాల 7, మెదక్ 1, మేడ్చల్ మల్కాజ్‌గిరి 11, ములుగు 2, నాగర్‌కర్నూల్ 3, నల్గొండ 7, నారాయణపేట్ 0, నిర్మల్ 2, నిజామాబాద్ 3, పెద్దపల్లి 6, సిరిసిల్లా 2, రంగారెడ్డి 8, సంగారెడ్డి 7, సిద్ధిపేట 5, సూర్యాపేట్ 4,వికారాబాద్ 5, వనపర్తి 0, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 8, యాదాద్రిలో మరో ముగ్గురికి వైరస్ సోకింది. అంతేగాక వైరస్ దాడిలో మరోకరు మరణించారు.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,95,270కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,91,699కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News