- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు, 13 మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 60,717కి చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 505 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ప్రస్తుతం 15,640 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 44,571 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క హైదరాబాద్ లోనే 521 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 289, మేడ్చల్ 151, వరంగల్ అర్బన్ లో 102 కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 18,263 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. అటు దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోంది.
1811 new COVID 19 cases recorded in Telangana
- Advertisement -