- Advertisement -
న్యూఢిల్లీః దేశంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,975 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా కరోనాపై హెల్త్ బులిటెన్ విడుద చేసిన ఆరోగ్య శాఖ.. ఈరోజు కరోనాతో 47 మంది మృతి చెందినట్లు పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 26,917కు చేరకోగా.. మృతుల సంఖ్య 826కు చేరింది. ఇక, కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 9,513మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో 20,177 మందికి చికిత్స కొనసాగుతుంది.
1,975 New Corona Cases Registered in India
- Advertisement -