Monday, April 29, 2024

విమానాశ్రయంలో 2.8 కిలోల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గ్రైండర్‌లో బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే ఓ వ్యక్తిని అధికారులు తనిఖీ చేశారు. అనుమానస్పదంగా కనిపించడంతో అతడి వద్ద గ్రైండర్ ఉంది. గ్రైండర్‌లోపలి భాగంలో 2.8 కిలోల బంగారాన్ని గుర్తించారు. అతడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News