- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 88,780 కరోనా పరీక్షలు చేయగా… 2618 కొత్త కోవిడ్-19 కేసులు, 16 మంది మృతి చెందారు. అదే సమయంలో 3509 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,25,966కు చేరింది. ఎపిలో ఇప్పటివరకు 6706 మంది మృతి చెందారు. కరోనా నుంచి ఇప్పటివరకు 7,95,592 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం 23,668 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కేసులు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 423, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 40 కేసులు బయటపడ్డాయని వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.
2168 new Covid Cases Reported in Andhra Pradesh
- Advertisement -