Wednesday, May 1, 2024

యుపిలో ఘోర రోడ్డుప్రమాదం: 23మంది మృతి

- Advertisement -
- Advertisement -

UP-Accident

ఔరయ: ఉత్తరప్రదేశ్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23మంది వలస కూలీలు చనిపోయారు.మరో 15మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కూలీలతో ప్రయాణిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వలసకూలీలు రాజస్థాన్ నుంచి యుపికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

బాధితులను బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబంగాల్ కు చెందిన వారిగా గుర్తించామని ఔరాయ జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఇటీవల కాలంలో వలసకూలీలతో వెళ్తున్న వాహనాలు తరుచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే.

23 Migrants died in road accident in Uttar Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News