Monday, May 6, 2024

తెలంగాణలో కొత్తగా 237 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

294 New Corona Cases Registered in AP

హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా మరో 237 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు, కరోనా మరో ముగ్గురు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. ఇందులో హైదరాబాద్ లోనే 195 కరోనా కేసులు నమోదు కావడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,974కు చేరింది.కరోనాతో మరణించిన వారి సంఖ్య మొత్తం 185 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 2, 412మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా బారి నుంచి కోలుకొని 2,377మంది డిశ్చార్జ్ అయ్యారు.

237 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News