Thursday, May 9, 2024

3 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్

- Advertisement -
- Advertisement -

Small schools close if 5 covid cases registered

హైదరాబాద్: తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో 3 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కానుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. 75 శాతం మందికి మొదటి డోస్ ఇవ్వగా 39 శాతం రెండో డోస్ పూర్తయిందని వెల్లడించారు. తెలంగాణలో 50 లక్షల వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని,  0.4 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. కోవిడ్ అదుపులో ఉందని,  కరోనా నుంచి 99 శాతం రక్షణ వ్యాక్సిన్ తో ఉందని, రెండో డోస్ తీసుకోవాల్సిన వాళ్ళు 36 లక్షల 35 వేల మంది ఉన్నారని ప్రకటించారు. రెండో డోస్ ను లైట్ గా తీసుకోవద్దని శ్రీనివాస్ రావు సూచించారు.  రష్యా, యుకెల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని,  వ్యాక్సిన్ తీసుకోని వాళ్లలో 60 శాతం మందికి వైరస్ సోకుతుందని, ఒక్క డోస్ తీసుకున్న వాళ్లలో 30 శాతం మందికి కరోనా సోకుతుందన్నారు. ప్రతి ఒక్కరు రెండు డోసులు తీసుకోవాలని,  రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోస్ కూడా తీసుకోలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News