Monday, April 29, 2024

ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు సిఆర్ పిఎఫ్ జవాన్లు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ లో బారాముల్ల జిల్లాలోని సొపొరే ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు, సిఆర్ పిఎఫ్ సంయుక్త బలగాలు లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు సిఆర్ పిఎఫ్ జవాన్లు మరణించగా, మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రత బలగాలు దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఎస్ డిహెచ్ ఆస్పత్రికి తరలించారు.

3 CRPF Personnel Killed By Terrorists in Baramulla Dist

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News