Saturday, April 27, 2024

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

- Advertisement -
- Advertisement -

38948 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,10,649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 38,948 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 219 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 3,30,27,621కు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,40,752మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 43,903మంది కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3,21,81,995మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,04,874 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా 68,75,41,762 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

38948 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News