భువనేశ్వర్: ఒడిషాలోని కలహండి జిల్లాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల పోరులో నలుగరు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఒడిషా పోలీసు స్పెషల్ ఆపరేషన్స్(ఎస్ఓజి)కు చెందిన ఒక జవాను కూడా గాయపడినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. కలహండి-కంధమాల్ సరిహద్దులోని భందరంగి సిర్కి అటవీ ప్రాంతంలో ఈ కాల్పుల పోరు జరిగినట్లు ఆయన తెలిపారు. మావోయిస్టుల కదలికలకు సంబంధించి సమాచారం రావడంతో ఎస్ఓజి సిబ్బంది, జిల్లా వాలంటరీ ఫోర్స్(డివిఎఫ్) కలసి గాలింపు చర్యలు చేపట్టాయని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రెండు పక్షాల మధ్య కాల్పులు జరిగాయని, దాదాపు గంటపాటు జరిగిన కాల్పుల పోరులో నలుగురు మావోయిస్టులు మరణించారని ఆ అధికారి పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగించేందుకు ఎస్ఓజి, డివిఎప్, సిఆర్పిఎఫ్కి చెందిన అదనపు బలగాలు ఆ ప్రాంతానికి తరలివెళ్లాయని ఆయన చెప్పారు.
4 Maoists shot dead by Security Forces in Odisha