Monday, May 6, 2024

జిహెచ్ఎంసిలో 46.68 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

46.68 Per Cent Polling in GHMC Elections

హైదరాబాద్: మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతాన్ని తెలంగాణ ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటించింది. 149 డివిజన్లకు గాను 46.68శాతం పోలింగ్ జరిగిందని తెలిపింది. అత్యధికంగా కంచన్ భాగ్ లో70.39శాతం, అత్యల్పంగా యూసఫ్ గూడలో 32.99శాతం పోలింగ్ జరిగినట్టు వెల్లడించింది. కాగా ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో గుర్తుల తారుమారు అయిన కారణంతో గురువారం రోజు రీపోలింగ్ జరగనుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్ దృష్ట్యా రేపు సెలవు ప్రకటించారు హైదరాబాద్ కలెక్టర్. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యా, వ్యాపార, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించారు. సెలవును అన్ని కార్యాలయాల యాజమాన్యాలు అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

46.68 Per Cent Polling in GHMC Elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News