Monday, April 29, 2024

తెలంగాణలో మరో 461 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

461 new Covid-19 cases Reported in Telangana

జిహెచ్‌ఎంసి పరిధిలో 108, జిల్లాల్లో 353 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి
2,86,815కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
సూర్యాపేట్‌లో ఒకే కుటుంబంలో 22 మందికి కోవిడ్ నిర్ధారణ

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 461 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 108 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 6, భద్రాద్రి 12 , జగిత్యాల 10, జనగాం 7, భూపాలపల్లి 3, గద్వాల 3, కామారెడ్డి 6, కరీంనగర్ 31,ఖమ్మం 11, ఆసిఫాబాద్ 3, మహబూబ్‌నగర్ 5, మహబూబాబాద్ 5, మంచిర్యాల 12, మెదక్ 6, మేడ్చల్ మల్కాజ్‌గిరి 41, ములుగు 4, నాగర్‌కర్నూల్ 7, నల్గొండ 14, నారాయణపేట్ 2, నిర్మల్ 3, నిజామాబాద్ 13, పెద్దపల్లి 11, సిరిసిల్లా 6, రంగారెడ్డి 44, సంగారెడ్డి 15, సిద్ధిపేట్ 10, సూర్యాపేట్ 15, వికారాబాద్ 4, వనపర్తి 5, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ లో 22, యాదాద్రిలో మరో 9 మందికి వైరస్ సోకింది. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,86,815కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,79,456కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు.

సూర్యాపేట్‌లో ఒకే కుటుంబంలో 22 మందికి కోవిడ్ నిర్ధారణ…

సూర్యాపేట్‌లో కరోనా ఒక్క సారిగా భయాందోళనను సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన 22 మంది కరోనా బారిన పడ్డారని జిల్లా అధికారులు తెలిపారు. ఇటీవల ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి ఒకరి అంత్యక్రియలకు వెళ్లగా ఆయనకు మొదట కరోనా సోకిందని, ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో మిగతా వారందరికీ వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం వీరందరికి చికిత్సను అందిస్తూ ప్రైమరీ కాంటాక్ట్‌లను ట్రేస్ చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News