Monday, April 29, 2024

రాష్ట్రంలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -

5 new omicron cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 143 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా, నలుగురు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటివరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి మొత్తంగా 12,410 మంది రాష్ట్రానికి వచ్చారు. ఒమిక్రాన్ బాధితుల్లో తాజాగా నలుగురు కోలుకోగా, ఇప్పటివరకు 22 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,926 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,587కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,025కి చేరింది. తాజాగా కరోనా బారి నుంచి 206 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,563 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News