- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో మరో 56 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 928కి చేరుకుంది. ఈరోజు కరోనా నుంచి కోలుకొని 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 711 యాక్టివ్ కేసులు ఉంగా.. ఇప్పటివరకు 194 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో అధికారులు కంటైన్మెంట్ జోన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. అలాగే పోలీసులు లాక్ డౌన్ ను మరింత కఠనంగా అమలు చేస్తున్నారు.
56 New Corona Cases Registered in Telangana
- Advertisement -