Saturday, April 27, 2024

ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టు

- Advertisement -
- Advertisement -

609 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టును నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పరీక్షలను చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల 5వేల 306 మందికి కోవిడ్ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. వాస్తవంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన ప్రకారం తెలంగాణలో ప్రతి రోజూ 5600 టెస్టులు చేయాలి. కానీ మన రాష్ట్రంలో ప్రతి రోజు సగటున ఏకంగా 50వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బుధవారం 53,686 మందికి పరీక్షలు చేయగా 609 మందికి పాజిటివ్ తేలింది.

వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 114 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 14, భద్రాద్రి 24, జగిత్యాల 15, జనగాం 14, భూపాలపల్లి 7, గద్వాల 1, కామారెడ్డి 10, కరీంనగర్ 22,ఖమ్మం 24, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 9, మహబూబాబాద్ 13, మంచిర్యాల 12, మెదక్ 9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 45, ములుగు 19, నాగర్‌కర్నూల్ 11, నల్గొండ 23, నారాయణపేట్ 0, నిర్మల్ 8, నిజామాబాద్ 10, పెద్దపల్లి 15, సిరిసిల్లా 15, రంగారెడ్డి 48, సంగారెడ్డి 12, సిద్ధిపేట్ 14, సూర్యాపేట్ 19, వికారాబాద్ 14, వనపర్తి 8, వరంగల్ రూరల్ 12, వరంగల్ అర్బన్ లో 29, యాదాద్రిలో మరో 14 మందికి వైరస్ సోకింది. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,71,492కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,61,028కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు.

లక్షా 90 వేల మందికి సింప్టమ్స్ లేకుండానే వైరస్ సోకింది…

రాష్ట్రంలో లక్షా 90 వేల మందికి పైగా ఎలాంటి సింప్టమ్స్ లేకుండానే వైరస్ సోకింది. అంటే ప్రతి వంద మందిలో 85 మందికి లక్షణాలు కనిపించకుండానే పాజిటివ్ తేలుతుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ కేటగిరికి చెందిన వ్యక్తులతోనే వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సెకండ్ వేవ్, శీతాకాలం నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News