Monday, April 29, 2024

ఒమిక్రాన్@653…

- Advertisement -
- Advertisement -

653 Omicron variant cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 6358 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 293 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 3.48 కోట్లకు చేరుకోగా 4.8 లక్షల మంది చనిపోయారు. 3.42 కోట్ల మంది కరోనా వ్యాధి నుంచి కోలుకోగా 75,456 మంది చికిత్స పొందుతున్నారు. దేశ ప్రజలకు 142.47 కోట్ల డోసులు ఇచ్చామని కేంద్రం తెలిపింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు చేరాయి. మహారాష్ట్ర(167), ఢిల్లీ(165), కేరళ(57), తెలంగాణ (55), గుజరాత్(49), రాజస్థాన్ (46)లాంటి రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News