Wednesday, May 1, 2024

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. అయోధ్య నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు అంబేద్కర్‌నగర్‌ వైపు వెళ్లడానికి జాతీయ రహదారిపై మలుపు తీసుకుంటున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీకొట్టింది. లక్నో-గోరఖ్ పూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ఘటనలో సంఘటన స్థలంలోనే ఏడుగురు మృతి చెందగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు జాతీయ రహదారి పై ఉన్న వాహనాలను తొలగించారు. గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News